Hyderabad: విద్యుత్ ఉద్యోగుల కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా సాయిబాబు
ABN , Publish Date - Jul 13 , 2025 | 05:43 AM
విద్యుత్ ఉద్యోగుల కార్మిక సంఘం(1104) ప్రధాన కార్యదర్శిగా జి.సాయిబాబు నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
విద్యుత్ ఉద్యోగుల కార్మిక సంఘం(1104) ప్రధాన కార్యదర్శిగా జి.సాయిబాబు నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లో శనివారం నిర్వహించిన యూనియన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్షుడిగా వేమూరి వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రాజేందర్ ఎన్నికయ్యారు.