DGP Jitender: పేరు రావాలన్నా పోవాలన్నా మీదే బాధ్యత
ABN , Publish Date - Apr 20 , 2025 | 06:48 AM
డీజీపీ జితేందర్ ఎస్హెచ్వోల పనితీరే పోలీసుల పేరు నిలబెట్టే మూలమని అన్నారు. ‘ఇండియా జస్టిస్-2025’ నివేదికలో తెలంగాణ పోలీసులు తొలి స్థానంలో నిలిచారని చెప్పారు
పోలీసు ఇన్స్పెక్టర్లకు డీజీపీ దిశానిర్దేశం
హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖకు మంచి పేరు రావాలన్నా.. ఉన్న పేరు పోవాలన్నా.. ఠాణాల స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్వో/ఇన్స్పెక్టర్)ల పనితీరే కీలకమని డీజీపీ జితేందర్ అభిప్రాయపడ్డారు. గడిచిన కొన్ని రోజులుగా విడతల వారీగా ఎస్హెచ్వోలతో భేటీ అవుతున్న డీజీపీ..60 మంది ఇన్స్పెక్టర్లతో సమావేశమై, వారికి దిశానిర్దేశం చేశారు. ‘ఇండియా జస్టిస్-2025’ నివేదికలో పోలీసింగ్ విభాగంలో తెలంగాణ పోలీసులు తొలిస్థానంలో ఉన్నారని, ఈ ఘనత వెనక సమష్టి కృషి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ గౌరవాన్ని కాపాడుకోవాలంటే.. పనితీరు మరింత మెరుపడాలని సూచించారు. సమావేశంలో అదనపు డీజీపీ(శాంతిభద్రతలు) మహేశ్ భగవత్, సీనియర్ ఐపీఎస్లు పాల్గొన్నారు.