Contract Lecturers Protest: గాంధీభవన్ను ముట్టడించిన అధ్యాపకులు
ABN , Publish Date - Apr 18 , 2025 | 05:15 AM
రాష్ట్రవ్యాప్తంగా 1200 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులరైజేషన్ డిమాండ్ చేస్తూ గాంధీభవన్ను ముట్టడించారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

అఫ్జల్గంజ్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): సర్వీసును క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 1200 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు గురువారం గాంధీభవన్ను ముట్టడించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ తమను రెగ్యులరైజ్ చేయాలని సీఎం ఆదేశించినా, అధికారుల నిర్లక్ష్యం వల్ల సమస్య జఠిలమవుతుందని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని 18నెలల నుంచి విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. నిరసన తెలిపిన అ ధ్యాపకులను పోలీసులు అరెస్టు చేసి, పలు పోలీ్సస్టేషన్లకు తరలించారు.