సిఐడీ అదనపు డీజీగా చారుసిన్హా బాధ్యతలు
ABN , Publish Date - Jun 06 , 2025 | 03:31 AM
తెలంగాణ సీఐడీ అదనపు డీజీగా 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి చారుసిన్హా గురువారం బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్, జూన్5(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఐడీ అదనపు డీజీగా 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి చారుసిన్హా గురువారం బాధ్యతలు స్వీకరించారు. గత ఏడేళ్లుగా సెంట్రల్ సర్వీసెస్ డిప్యూటేషన్లో భాగంగా సీఆర్పీఎ్ఫలో బిహర్, జమ్మూకశ్మీర్, సదరన్ సెక్టార్లో ఆమె బాధ్యతలు నిర్వహించారు.
సీఆర్పీఎఫ్ చరిత్రలోనే నాలుగు ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించిన తొలి ఐపీఎస్ అధికారిగా చారుసిన్హా నిలిచారు. సీఐడీతో పాటు మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా సెంటర్ల బాధ్యతలను ప్రభుత్వం తాజాగా ఆమెకు అప్పగించింది.