అంబేద్కర్ రాజ్యాంగం వల్లే సంక్షేమ ఫలాలు
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:57 PM
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందు తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందు తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. శనివారం మంచిర్యాల పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో విద్యా ర్థులతో నిర్వహించిన రాజ్యాంగ గౌరవ దినోత్సవం కార్యక్రమంలో ఆ యన పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత చరిత్ర ను, రాజ్యాంగ విలువలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాల న్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తామన్నారు. అంబేద్కర్ ను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. అంబే ద్కర్ జీవిత చరిత్రను అందరు తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజు, వెంకటేశ్వర్రావు, లచ్చన్న, రాజన్న, ప్రభాకర్, అశ్విన్, సతీష్రావు, దేవేందర్, వెంకన్న, దుర్గా ప్రసాద్,చిరంజీవి, శ్రీనివాస్, తరుణ్సింగ్, నరేందర్ పాల్గొన్నారు.