ఇబ్బందులు లేకుండా ధాన్యం కొంటాం
ABN , Publish Date - May 09 , 2025 | 11:48 PM
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరిధాన్యంను కొనుగోలు చేస్తామని జిల్లా గ్రామీణాఽభివృద్ధి శాఖ (డీఆర్ డీవో) అధికారి కిషన్ అన్నారు. దండేపల్లి మండల కేంద్రంలో పాటు నెల్కి వెంకటాపూర్ కర్ణపేట, మామిడిపల్లి, లింగాపూర్, నాగసముద్రం గ్రామా ల్లో ఏర్పాటు చేసిన దాన్యం కోనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన సం దర్శించారు. మాట్లాడుతూ రైతులు నాణ్యమైన ధాన్యం కోనుగోలు కేంద్రా లకు తీసుకరావలన్నారు. ధాన్యం తెచ్చేటప్పుడు తాలు లేకుండా తేమ శా తం తక్కువగా ఉండేలా చూసుకోవాలన్నారు.

జిల్లా గ్రామీణాఽభివృద్ధి శాఖ అధికారి కిషన్
దండేపల్లి,మే 9(ఆంధ్రజ్యోతి): రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరిధాన్యంను కొనుగోలు చేస్తామని జిల్లా గ్రామీణాఽభివృద్ధి శాఖ (డీఆర్ డీవో) అధికారి కిషన్ అన్నారు. దండేపల్లి మండల కేంద్రంలో పాటు నెల్కి వెంకటాపూర్ కర్ణపేట, మామిడిపల్లి, లింగాపూర్, నాగసముద్రం గ్రామా ల్లో ఏర్పాటు చేసిన దాన్యం కోనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన సం దర్శించారు. మాట్లాడుతూ రైతులు నాణ్యమైన ధాన్యం కోనుగోలు కేంద్రా లకు తీసుకరావలన్నారు. ధాన్యం తెచ్చేటప్పుడు తాలు లేకుండా తేమ శా తం తక్కువగా ఉండేలా చూసుకోవాలన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయిం చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద తాగునీరు, నీడను కల్పించాలన్నారు. కేంద్రాలలో గన్నీ సంచుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు చూసుకోని లే కుంటే తెప్పించుకోవాలన్నారు. తూకం వేసి ధాన్యం బస్తాలను ఎప్పటిక ప్పుడు రైస్మిల్లుకు తరలించాలని, లారీల కొరత లేకుండా ఏర్పాటు చేయా లన్నారు. లారీ అవసరం ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే లారీలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో జేఆర్ ప్రసాద్, ఐకేపీ ఏపీఎం భూపతి బ్రహ్మయ్య, జిల్లా సమైఖ్య అధ్యక్షురాలు అల్లంల అనిత, సీసీలు తిరుపతిగౌడ్, సురేందర్, లావణ్య, కోమురయ్య, వివోఏలు, గ్రామైఖ్య సం ఘాల లీడర్లు, సభ్యులు, రైతులు, హమాలీలు, పాల్గొన్నారు.