Share News

అకాల వర్షం....అపార నష్టం

ABN , Publish Date - May 09 , 2025 | 11:55 PM

మంచిర్యాల, మే 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూ డు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచింది. భారీ వర్షం కారణంగా కల్లాల్లో ఉన్న ధాన్యం మొత్తం నీటిపాలుకాగా అపార నష్టం వాటిళ్లింది. ఓ వైపు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు యు ద్ధ ప్రాతిపదికన ప్రారంభించి, రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నా, వరుణుడి భారి నుంచి రైతు తప్పించుకో లేకపోయాడు. జిల్లాలో దాదాపుగా వరి కోతలు పూర్తి కావచ్చినప్పటికీ కల్లాల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది.

అకాల వర్షం....అపార నష్టం
భీమారం మండలంలో కల్లాల్లోనే తడిసిన ధాన్యం (ఫైల్‌)

-అన్నదాతపై వరుణుడి కన్నెర్ర

-చేతికి వచ్చిన పంట నీళ్లపాలు

-కల్లాల్లోనే తడిసి ముద్దయిన ధాన్యం

-జిల్లాలో మామిడి పంటకూ తీరని నష్టం

మంచిర్యాల, మే 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూ డు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచింది. భారీ వర్షం కారణంగా కల్లాల్లో ఉన్న ధాన్యం మొత్తం నీటిపాలుకాగా అపార నష్టం వాటిళ్లింది. ఓ వైపు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు యు ద్ధ ప్రాతిపదికన ప్రారంభించి, రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నా, వరుణుడి భారి నుంచి రైతు తప్పించుకో లేకపోయాడు. జిల్లాలో దాదాపుగా వరి కోతలు పూర్తి కావచ్చినప్పటికీ కల్లాల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. చేతిక వచ్చిన పంట నీళ్లపాలు కావడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఆరుగా లం శ్రమించి సాగు చేసిన పంట ప్రకృతి వైపరీతం కారణంగా నీటిపాలుకాగా, రైతులకు కోలుకోలేని విధం గా నష్టాన్ని కలిగించింది. అలాగే మామిడి సైతం అకా ల వర్షాలకు పెద్ద మొత్తంలో నేలరాలడంతో రైతులకు భారీ నష్టాన్ని మిగల్చింది.

దిగుబడి వచ్చినా చేతికిరాని పంట...

జిల్లాలో గత సంవత్సరం యాసంగిలో 2లక్షల 28 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, ఈ సీజ న్‌లో లక్షా 21,702 ఎకరాల్లో వరి పంట సాగైంది. ఇం దులో దొడ్డు రకం లక్షా 14,774 ఎకరాలు కాగా, సన్న రకం 6928 ఎకరాల్లో సాగు చేయగా, 3,40,301 మెట్రిక్‌ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో దొడ్డు రకం 3,23,639 మెట్రిక్‌ టన్నులు కాగా, సన్నరకం ధాన్యం 16,662 మెట్రిక్‌ టన్నులు వస్తుం దని భావిస్తున్నారు. అయితే ఊహించని రీతిలో అకాల వర్షాలు కురవడంతో పంట నీళ్లపాలైంది. ధాన్యం తడ వకుండా రైతులు టార్పాలిన్‌, పాలిథిన్‌ కవర్లు కప్పి, తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ భారీ వర్షం కురవ డంతో మొత్తం తడిసి ముద్దయింది. కల్లాల్లో ఉన్న ధా న్యం బస్తాలు పూర్తిగా నీటిలో తడిసిపోయాయి.

చేతికి వచ్చిన పంట వర్షార్పణం...

గత నెల 30 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు కురి సిన అకాల వర్షాల కారణంగా చేతికి వచ్చిన పంట వ ర్షార్పణం అయింది. వరి పంటకు సంబంధించి నెన్నెల, భీమారం మండలాల్లో రైతులకు భారీ నష్టం వాటిల్లిం ది. ఆయా మండలాల్లో 490 రైతులకు సంబంధించిన 862 ఎకరాల్లో పంట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిం ది. మొత్తంగా 2 లక్షల పై చిలుకు మెట్రిక్‌ టన్నుల ధా న్యం నీటిపాలైనట్లు అంచనా. అలాగే మామిడి పంట కు సంబంఽధించి నెన్నెల, జైపూర్‌, భీమారం, బెల్లంపల్లి, తాండూరు, మందమర్రి మండలాల్లో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. ఆయా మండలాల్లోని 1814 మంది రైతులకు సంబంధించిన 3713 ఎకరాల్లో మామిడి పంట నేలరాలింది.

వేగం పుంజుకున్న కొనుగోళ్లు...

అకాల వర్షాల కారణంగా అన్నదాతకు అపార నష్టం వాటిల్లడం, మరిన్ని అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు ధాన్యం కొను గోళ్లలో వేగం పెంచారు. జిల్లాలో ఏర్పాటు చేయాలను కున్న 361 కొనుగోలు కేంద్రాలకు గాను నేటికి 345 ప్రా రంభించి కొనుగోళ్లు వేగవంతం చేశారు. ఇప్పటి వరకు 242 కేంధ్రాల ద్వారా 59,500 టన్నుల ధాన్యం కొనుగో లు చేశారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి పోకుండా వెంట వెంటనే కాంటా వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధా న్యాన్ని సైతం ఎప్పటికప్పుడు రైస్‌ మిల్లులకు తరలిం చి నిలువ చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు అం చనా వేసిన ప్రకారం యాసంగి సీజన్‌లో 3,40,301 మె ట్రిక్‌ టన్నులు దిగుబడి వస్తుంది. అందులో ప్రైవేటు మార్కెట్లో విక్రయించడం, తాలు, తప్ప పోను కనీసం రెండు లక్షల పై చిలుకు మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొను గోలు కేంద్రాల ద్వారా సేకరించాల్సి ఉంది. ఇందులో కే వలం 50వేలపై చిలుకు టన్నులు మాత్రమే కొనుగో లు చేశారు. ఇంకా మూడు వంతుల ధాన్యం కొనుగో లు చేయాల్సి ఉంది. ముందుగా నిర్ణయించినట్లు జి ల్లా వ్యాప్తంగా 361 కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉం డగా, నెల రోజులు గడుస్తున్నా....ఇంత వరకు పూర్తి స్థాయిలో సెంటర్లు ఏర్పాటు కాలేదు. మరోవైపు జిల్లా లో ప్రారంభించిన 345 సెంటర్లలో 242 కేంద్రాల్లోనే కొ నుగోలు జరుగుతున్నాయి. మిగతా చోట్ల ఇంకా కొనుగో ళ్లు ప్రారంభించలేదు. ఈ కారణంగానూ అకాల వర్షాల కు ఽధాన్యానికి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది.

Updated Date - May 09 , 2025 | 11:55 PM