సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
ABN , Publish Date - May 06 , 2025 | 12:02 AM
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధించి సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో పరిష్కరించే విధంగా చర్యలను చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు.
- ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, ఏప్రిల్ మే 5 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధించి సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో పరిష్కరించే విధంగా చర్యలను చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యలయాల భవన సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ మోతిలాల్, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి హరిక్రిష్ణలతో కలిసి దరఖాస్తు దారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామానికి చెందిన చం ద్రమౌళి తమకు గ్రామ శివారులో ఉన్న భూమిని ఇతరులు అక్రమంగా ఆక్రమించారని దర ఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి పట్టణంలో సమీకృత కూరగాయల మార్కెట్లో షెటర్ల లబ్ధిదా రులు తాము వ్యాపారం చేసుకునే స్థలాన్ని అప్పగించినప్పుడు తమకు షెట్టర్లను ఇస్తామని హామీ ఇచ్చారని, ఈ మేరకు వ్యాపారం చేసుకునే వరుసలో రూములు ఇప్పించాలని పలువురు వ్యాపారులు కోరారు. నస్పూర్ కు చెందిన లలిత తాను మీ సేవా ఏర్పాటుకు అర్హత కలిగి ఉ న్నానని, అవకాశం కల్పించాలని దరఖాస్తు చేశారు. లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల చెరువు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను నిర్ణయించాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రతి నిధులు దరఖాస్తు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా వాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చేస్తామన్నారు.