Share News

పారిశుధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలి

ABN , Publish Date - May 09 , 2025 | 11:46 PM

మందమర్రిరూరల్‌, మే 9 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో పారిశుధ్య పనుల ను ముమ్మరంగా చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు సూచించారు. శుక్రవారం మండలంలోని మామిడిగట్టు, శంకర్‌పల్లి గ్రామా ల్లో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రోడ్లను, మురికి కాలువలను శుభ్రంగా ఉంచాలన్నారు. మంచినీటి సమస్య లేకుండా చూడాలన్నారు. సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలిం చాలన్నారు.

పారిశుధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలి

మందమర్రిరూరల్‌, మే 9 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో పారిశుధ్య పనుల ను ముమ్మరంగా చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు సూచించారు. శుక్రవారం మండలంలోని మామిడిగట్టు, శంకర్‌పల్లి గ్రామా ల్లో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రోడ్లను, మురికి కాలువలను శుభ్రంగా ఉంచాలన్నారు. మంచినీటి సమస్య లేకుండా చూడాలన్నారు. సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలిం చాలన్నారు. నర్సరీల్లోని మొక్కలను సంరక్షించాలని, నీరు పోయాలని సూ చించారు. అనంతరం పంచాయతీ రికార్డులను పరిశీలించారు. ఆయన వెం ట ఎంపీడీవో రాజేశ్వర్‌, ఎంపీవో సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శు లు సంధ్యారాణి, రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2025 | 11:46 PM