Share News

అర్జీలు స్వీకరించి.. భరోసా కల్పించి..

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:21 PM

జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే దరఖాస్తుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు.

అర్జీలు స్వీకరించి.. భరోసా కల్పించి..
దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

- ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే దరఖాస్తుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరిగతిన పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఫ అందిన దరఖాస్తులు..

- ఆసిఫాబాద్‌ పట్టణం సందీప్‌నగర్‌కు చెందిన షేక్‌ మున్నా తనకు పెన్షన్‌ ఇప్పించాలని అర్జీ సమర్పించారు.

- సిర్పూర్‌(టి) మండలం పూసిగూడ గ్రామానికి చెందిన గిరిజనులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అటవీ శాఖ సమస్య పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

- రెబ్బెన మండలం గోలేటికి చెందిన దేవయ్య తన తండ్రి పేరిట ఉన్న భూమిని ఆయన మరణించినందున తన పేరిట విరాసత్‌ చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

- చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన యువకులు తమ గ్రామ పంచాయతీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

- సిర్పూర్‌(టి) మండల కేంద్రానికి చెందిన దుర్గం నిర్మల తనకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, పారిగాం గ్రామానికి చెందిన కారుబాయి తన భర్త మరణించినందున డెత్‌ సర్టిఫికేట్‌ జారీ చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

- కాగజ్‌నగర్‌ పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన ఫర్వీన్‌ సుల్తానా తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

- రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన పెద్దపల్లి లక్ష్మి తాను సాగు చేస్తున్న భూమికి పట్టా మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు.

Updated Date - Nov 17 , 2025 | 11:21 PM