ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు తీవ్ర నష్టం
ABN , Publish Date - May 28 , 2025 | 11:39 PM
అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోవడానికి ప్రభుత్వమే కారణమని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
నెన్నెల, మే 28 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోవడానికి ప్రభుత్వమే కారణమని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపించారు. మండలంలోని మైలారం, గొళ్లపల్లి గ్రామాల్లో దుర్గం చిన్నయ్య బుధవారం పర్యటించారు. వర్షానికి తడిసిన ధాన్యం కుప్పలను పరిశీలిచారు. భాది త రైతులకు అండగా ఉంటామని భరో సా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగో ళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోందన్నారు. కోతలు కోసి ధాన్యం కొనే వారి కోసం రైతులు నెల రోజు లుగా ఎదురు చూస్తున్నారన్నారు. ఎప్పటికప్పుడు ధాన్యం సేకరించి మిల్లులకు తరలిస్తే వర్షాలతో రైతులకు నష్టం జరిగేది కాద న్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పంజాల సాగర్గౌడ్, నాయకులు ఎండీ ఇబ్రాహీం, ఇందూ రి రమేష్, మేకల మల్లేష్, శ్రీనివాస్గౌడ్, ప్రేమ్సాగర్, తిరుపతిగౌడ్, శివప్రసాద్, శంకర్ తదితరులు ఉన్నారు.