అందుబాటులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
ABN , Publish Date - May 09 , 2025 | 11:52 PM
భీమారం, మే 9 (ఆంధ్రజ్యోతి) : మండల ప్రజల సౌకర్యార్థం మండల కేం ద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మిస్తున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నా రు. శుక్రవారం భీమారం మండల కేంద్రంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం నిర్మాణ పనులను తహసీల్దార్ సదానందంతో కలిసి పరిశీలించారు. క లెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీ సుకుంటున్నామన్నారు. నిర్మాణ పనులను వేగవంతంగా చేసేలా అధికారులు ప ర్యవేక్షించాలన్నారు.

కలెక్టర్ కుమార్ దీపక్
భీమారం, మే 9 (ఆంధ్రజ్యోతి) : మండల ప్రజల సౌకర్యార్థం మండల కేం ద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మిస్తున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నా రు. శుక్రవారం భీమారం మండల కేంద్రంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం నిర్మాణ పనులను తహసీల్దార్ సదానందంతో కలిసి పరిశీలించారు. క లెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీ సుకుంటున్నామన్నారు. నిర్మాణ పనులను వేగవంతంగా చేసేలా అధికారులు ప ర్యవేక్షించాలన్నారు. అనంతరం మండల కేంద్రం, మద్దికల్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి నిర్వహకులకు సూచనలు చేశారు. రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం అంకుశాపూర్, కొత్తప ల్లి గ్రామపంచాయతీల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న భూ భారతి రెవెన్యూ సదస్సులను సందర్శించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలిం చా రు. భూభారతి చట్టంలో భాగంగా భీమారం మండలాన్ని పైలెట్ మండలం గా ఎంపిక చేసి భూ సమస్యల దరఖాస్తులను స్వీకరించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. సాదాబైనామా దరఖాస్తులను కూడా పరిష్కరి స్తామన్నారు. అనంతరం ఆయా పాఠశాలల్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబి రాలను సందర్శించారు. విద్యార్థులకు వివిద రకాల అంశాల్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నామని దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని సమగ్ర ఆగ్రో ఇండస్ర్టీస్ రైసుమిల్లును ప్రత్యేక తహ సీల్దార్ కృష్ణతో కలిసి సందర్శించి నిర్వహకులకు పలు సూచనలు చేశారు. సీఎంఆర్ లక్ష్యాల సాదన ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.