Share News

దేశం నాకెంతో ఇచ్చింది!

ABN , Publish Date - Jan 27 , 2025 | 02:56 AM

హాకీకి తాను చేసిన సేవకంటే.. దేశం తనకు ఎంతో ఎక్కువ ఇచ్చిందని మాజీ గోల్‌కీపర్‌ శ్రీజేష్‌ అన్నాడు. కేంద్ర ప్రభుత్వం తనకు ప్రతిష్ఠాత్మక పౌరపురస్కారం ‘పద్మభూషణ్‌’ ప్రకటించిన నేపథ్యంలో...

దేశం నాకెంతో ఇచ్చింది!

న్యూఢిల్లీ: హాకీకి తాను చేసిన సేవకంటే.. దేశం తనకు ఎంతో ఎక్కువ ఇచ్చిందని మాజీ గోల్‌కీపర్‌ శ్రీజేష్‌ అన్నాడు. కేంద్ర ప్రభుత్వం తనకు ప్రతిష్ఠాత్మక పౌరపురస్కారం ‘పద్మభూషణ్‌’ ప్రకటించిన నేపథ్యంలో శ్రీజేష్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘గతం మొత్తం ఒక్కసారి అలా కళ్లముందు తిరిగింది. 20 ఏళ్లుగా హాకీకి నేను చేసిన దానికంటే.. దేశం నాకెంతో ఎక్కువ ఇచ్చింది. పద్మభూషణ్‌ లాంటి అత్యున్నత పురస్కారం ప్రకటించడం ఇంకా కలగానే అనిపిస్తోంది. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ తర్వాత ఈ అవార్డును అందుకోనుండడం నిజంగా నా అదృష్టం’ అని శ్రీజేష్‌ చెప్పాడు. రిటైర్మెంట్‌ తర్వాత అతడు భారత జూనియర్‌ జట్టుకు కోచ్‌గా పనిచేస్తున్నాడు.


ఇదీ చదవండి:

నితీష్‌తో ఆడుకుంటున్న గంభీర్.. తెలుగోడి కెరీర్‌కు డేంజర్

Updated Date - Jan 27 , 2025 | 02:56 AM