Share News

ఆసియా జూ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టీమ్‌లో తన్వీ వెన్నెల ప్రణవ్‌

ABN , Publish Date - Jun 27 , 2025 | 05:40 AM

ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పకు ఎంపిక చేసిన జట్టులో తెలుగు ప్లేయర్లు వెన్నెల కోలగట్ల, తన్వీ రెడ్డి అండ్లూరి, ప్రణవ్‌ రామ్‌తోపాటు...

ఆసియా జూ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టీమ్‌లో తన్వీ వెన్నెల ప్రణవ్‌

డబుల్స్‌లో భార్గవ్‌, కీర్తి జోడీలు

న్యూఢిల్లీ: ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పకు ఎంపిక చేసిన జట్టులో తెలుగు ప్లేయర్లు వెన్నెల కోలగట్ల, తన్వీ రెడ్డి అండ్లూరి, ప్రణవ్‌ రామ్‌తోపాటు భార్గవ్‌, కీర్తి జోడీలకు చోటు దక్కింది. మొత్తం 19 మంది జట్టు సభ్యులను భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) గురువారం ప్రకటించింది. ఈ టోర్నీ జూలై 18 నుంచి 27 వరకు ఇండోనేసియాలో జరగనుంది. టీమ్‌, వ్యక్తిగత విభాగాల్లో భారత షట్లర్లు తలపడనున్నారు. తెలంగాణకు చెందిన వెన్నెల, తన్వీ, ప్రణవ్‌ సింగిల్స్‌లో బరిలోకి దిగనుండగా.. మిక్స్‌డ్‌లో కీర్తి మంచాల-విష్ణు కేదార్‌ జోడీ ఆడనుంది. పురుషుల డబుల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భార్గవ్‌ రామ్‌ అరిగెళ్ల-విశ్వతేజ గొబ్బూరు జోడీ సత్తాచాటనుంది. గతంలో ఇదే ఈవెంట్‌లో పీవీ సింధు, లక్ష్య సేన్‌ స్వర్ణాలు గెలిచారు.

ఇవీ చదవండి:

ప్లీజ్.. ఆ పని మాత్రం చేయకు

అనుకున్నంత పని చేశారుగా

బుమ్రా గాలి తీసిన సంజన

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 27 , 2025 | 05:40 AM