వరల్డ్ యూత్ ఆర్చరీ పోటీలకు ముగ్గురు తెలుగోళ్లు
ABN , Publish Date - May 27 , 2025 | 02:12 AM
ప్రపంచ యూత్ ఆర్చరీ పోటీలకు ముగ్గురు తెలుగోళ్లు అర్హత సాధించారు. పుణెలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రపంచ యూత్ ఆర్చరీ పోటీలకు ముగ్గురు తెలుగోళ్లు అర్హత సాధించారు. పుణెలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ ట్రయల్స్లో భీమవరం ఆర్చర్లు గణేష్, సూర్యహంసిని, పెద్దపల్లికి చెందిన చికితరావు సత్తా చాటారు. ఈ ప్రదర్శనతో వీరు ఆగస్టులో కెనడా వేదికగా జరిగే ప్రపంచ యూత్ ఆర్చరీ పోటీలకు అర్హత సాధించారు. గణేష్, చికిత.. జూన్లో సింగపూర్లో జరిగే ఆసియా కప్ స్టేజ్-2 పోటీలకు కూడా బెర్త్లు దక్కించుకున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి