Share News

మెయిన్‌ డ్రాకు శ్రీకాంత్‌

ABN , Publish Date - May 21 , 2025 | 03:28 AM

కిడాంబి శ్రీకాంత్‌ మలేషియా మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌ మెయిన్‌ డ్రాకి అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన సింగిల్స్‌ క్వాలిఫయర్స్‌ రెండో మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 9-21, 21-12, 21-6తో...

మెయిన్‌ డ్రాకు శ్రీకాంత్‌

మలేసియా మాస్టర్స్‌ టోర్నీ

కౌలాలంపూర్‌: కిడాంబి శ్రీకాంత్‌ మలేషియా మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌ మెయిన్‌ డ్రాకి అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన సింగిల్స్‌ క్వాలిఫయర్స్‌ రెండో మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 9-21, 21-12, 21-6తో హువాంగ్‌ యు కై (చైనీస్‌ తైపీ)పై గెలిచాడు. తరుణ్‌ మన్నేపల్లి 13-21, 21-23తో పనిట్చాఫోన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడాడు. ప్రధాన పోటీల మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో ప్రేరణ-మృణమయి జోడీ 21-19, 19-21, 21-13తో భారత్‌కే చెందిన వైష్ణవి-అలీషా జంటపై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించగా, రష్మీ-సానియా ద్వయం, సిమ్రాన్‌-కవిప్రియ జంట ఓటమి పాలయ్యారు. పురుషుల డబుల్స్‌లో పృథ్వీ కృష్ణమూర్తి రాయ్‌-ప్రతీక్‌ ద్వయం, హరిహరన్‌-రుబాన్‌ జోడీ ఇంటిముఖం పట్టారు.

ఇవి కూడా చదవండి..

IPL 2025 CSK vs RR: రాణించిన ఆయుష్, బ్రేవిస్.. రాజస్తాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే

Preity zinta hugs Vaibhav: వైభవ్ సూర్యవంశీకి హగ్.. ప్రీతి జింటా స్పందన ఏంటంటే

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 21 , 2025 | 03:28 AM