రాణించిన రిత్విక్ జోడీ
ABN , Publish Date - Feb 03 , 2025 | 05:21 AM
డేవిస్ కప్ వరల్డ్కప్ గ్రూప్-1లో ప్లేఆ్ఫ్సలో భారత్ 4-0తో టోగోను చిత్తు చేసింది. తొలి రోజు రెండు సింగిల్స్ మ్యాచుల్లోనూ నెగ్గిన భారత్..

4-0తో టోగోపై భారత్ గెలుపు
న్యూఢిల్లీ: డేవిస్ కప్ వరల్డ్కప్ గ్రూప్-1లో ప్లేఆ్ఫ్సలో భారత్ 4-0తో టోగోను చిత్తు చేసింది. తొలి రోజు రెండు సింగిల్స్ మ్యాచుల్లోనూ నెగ్గిన భారత్.. ఆదివారం జరిగిన డబుల్స్, రివర్స్ సింగిల్స్ మ్యాచ్ల్ని సొంతం చేసుకొంది. తొలుత జరిగిన డబుల్స్లో శ్రీరామ్ బాలాజీ-తెలుగు కుర్రాడు రిత్విక్ చౌదరి జంట 6-2, 6-1తో ఎమ్లపా-ఇసాక్ను చిత్తు చేశారు. నాలుగో మ్యాచ్గా జరిగిన రివర్స్ సింగిల్స్లో కరణ్ సింగ్కు అరంగేట్రం చేసే చాన్స్ దక్కింది. కరణ్ 6-2 6-3తో ఇసాక్పై నెగ్గాడు. ఫలితం తేలిపోవడంతో ఐదో మ్యాచ్ ఆడలేదు. ఈ విజయంతో భారత్ గూప్-1లో తన స్థానాన్ని నిలబెట్టుకొంది.