పాక్.. అదే తీరు
ABN , Publish Date - Mar 19 , 2025 | 05:17 AM
న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీ్సలో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఇరు జట్ల మధ్య జరిగిన రెండో టీ20లోనూ...
కివీ్సతో రెండో టీ20లోనూ చిత్తు
డ్యునెడిన్: న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీ్సలో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఇరు జట్ల మధ్య జరిగిన రెండో టీ20లోనూ పాక్ 5 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో కివీస్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 15 ఓవర్లకు కుదించగా.. పాక్ 9 వికెట్లకు 135 పరుగులు చేసింది. కెప్టెన్ సల్మాన్ ఆఘా (46), షాదాబ్ ఖాన్ (26), షహీన్ (22 బ్యాటింగ్) మాత్రమే రాణించారు. స్పిన్నర్ సోధి, పేసర్లు డఫీ, సియర్స్, నీషమ్లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో కివీస్ 13.1 ఓవర్లలో 5 వికెట్లకు 137 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు సీఫర్ట్ (45), ఆలెన్ (38) మెరుపు ఇన్నింగ్స్తో తొలి వికెట్కు 20 బంతుల్లోనే 66 పరుగులు అందించారు. పేసర్ రౌఫ్కు రెండు వికెట్లు దక్కాయి.
ఇవీ చదవండి:
యుద్ధభూమిని వీడొద్దు: హార్దిక్
ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్న పంత్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి