Fifth Test 2025: ఇంగ్లండ్ జట్టులోకి ఒవర్టన్
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:43 AM
భారత్తో జరిగే ఐదో టెస్టు కోసం పేసర్ జేమీ ఒవర్టన్ను ఇంగ్లండ్ తిరిగి రప్పించింది. తొలి మూడు టెస్టుల్లో అతడు జట్టుతో పాటే ఉండగా..
లండన్: భారత్తో జరిగే ఐదో టెస్టు కోసం పేసర్ జేమీ ఒవర్టన్ను ఇంగ్లండ్ తిరిగి రప్పించింది. తొలి మూడు టెస్టుల్లో అతడు జట్టుతో పాటే ఉండగా.. మాంచెస్టర్ మ్యాచ్కు ముందే కౌంటీల కోసం విడుదల చేశారు. అయితే నాలుగో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు అలసిపోయారు. గురువారం నుంచే ఆఖరి టెస్టు జరుగనుండడంతో ముందు జాగ్రత్తగా పేస్ ఆల్రౌండర్ ఒవర్టన్ను రప్పించారు. భుజం నొప్పితో బాధపడుతున్న కెప్టెన్ స్టోక్స్ చివరి టెస్టుకు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు.
ఇవి కూడా చదవండి..
ఇంగ్లండ్తో 4వ టెస్టు మ్యాచ్ టీమిండియా అద్భుత పోరాటం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..