నీరజ్ క్లాసిక్ ఈవెంట్ 5న
ABN , Publish Date - Jun 04 , 2025 | 04:09 AM
‘నీరజ్ చోప్రా క్లాసిక్’ మొట్టమొదటి అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్ వచ్చేనెల 5న బెంగళూరులో జరగనుంది. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, భారత స్టార్ నీరజ్ చోప్రా ఆధ్వర్యంలో...
బెంగళూరు: ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ మొట్టమొదటి అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్ వచ్చేనెల 5న బెంగళూరులో జరగనుంది. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, భారత స్టార్ నీరజ్ చోప్రా ఆధ్వర్యంలో జేఎ్సడబ్ల్యూ స్పోర్ట్స్ సహకారంతో అతని పేరుతోనే ఈ ఆరంభ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ గతనెల 24న జరగాల్సి ఉంది. అయితే, భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈవెంట్ను అప్పట్లో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు, భారత్ నుంచి ఐదుగురితో కలిపి మొత్తం 12 మంది జావెలిన్ త్రోయర్లు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
ఇవీ చదవండి:
గుకేష్ ఎమోషనల్.. వీడియో చూడాల్సిందే!
బీసీసీఐ బాస్గా మాజీ జర్నలిస్ట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి