Mukesh Wins Two Medals: ముఖేష్కు రెండు పతకాలు
ABN , Publish Date - Aug 30 , 2025 | 03:30 AM
ఆసియా చాంపియన్షి్పలో ఆంధ్రప్రదేశ్ షూటర్ నేలవల్లి ముకేష్ రెండు పతకాలు కొల్లగొట్టాడు. జూనియర్ పురుషుల 25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో పసిడి పతకం..
ఆసియా షూటింగ్ చాంపియన్షిప్
షిమ్కెంట్ (కజకిస్థాన్): ఆసియా చాంపియన్షి్పలో ఆంధ్రప్రదేశ్ షూటర్ నేలవల్లి ముకేష్ రెండు పతకాలు కొల్లగొట్టాడు. జూనియర్ పురుషుల 25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో పసిడి పతకం అందుకున్న ముకేష్, వ్యక్తిగత కేటగిరీలో కాంస్యం సాధించాడు. శుక్రవారం జరిగిన 25మీ. పిస్టల్ టీమ్ విభాగంలో ముకేష్, సూరజ్, అభినవ్ త్రయం (1746 పాయింట్లు) స్వర్ణం దక్కించుకుంది. జూనియర్ 25 మీ. పిస్టల్ వ్యక్తిగత కేటగిరీలో ముకేష్ (576) కాంస్యం నెగ్గాడు. పురుషుల 25 మీ. ఫైర్పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రాజ్కన్వర్ సింగ్ స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ఆపై..రాజ్కన్వర్, గురుప్రీత్, అంకుర్ త్రయం 25మీ. ఫైర్ పిస్టల్ టీమ్ విభాగంలో పసిడి దక్కించుకుంది. పురుషుల డబుల్ ట్రాప్ వ్యక్తిగత కేటగిరీలో అంకుర్కు స్వర్ణం, టీమ్ విభాగంలో కాంస్యం లభించాయి. ఇక మహిళల డబుల్ ట్రాప్ వ్యక్తిగత విభాగంలో మనోళ్లు క్లీన్ స్వీప్ చేశారు. సీనియర్ విభాగంలో భారత్ మొత్తం 31 పతకాలు (14-8-9) సాధించింది. తద్వారా చైనా (15-12-3=30) తర్వాత రెండో స్థానంలో నిలిచింది. అయితే ఓవరాల్గా సీనియర్, జూనియర్, యూత్ విభాగాలలో కలిపి మనోళ్లు మొత్తం 103 పతకాలు (52-26-25) కైవసం చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..