IPL 2025 RCB vs RR: రాణించిన కోహ్లీ, పడిక్కళ్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
ABN , Publish Date - Apr 24 , 2025 | 09:18 PM
స్వంత మైదానం అయిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెలరేగింది. కింగ్ కోహ్లీ (70) మరోసారి చెలరేగడంతో పాటు దేవ్దత్ పడిక్కళ్ (50) హాఫ్ సెంచరీ చేయడంతో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. బ్యాటింగ్కు అనుకూలించిన పిచ్పై ఆర్సీబీ వేగంగా పరుగులు చేసింది.

స్వంత మైదానం అయిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెలరేగింది. కింగ్ కోహ్లీ (70) మరోసారి చెలరేగడంతో పాటు దేవ్దత్ పడిక్కళ్ (50) హాఫ్ సెంచరీ చేయడంతో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. బ్యాటింగ్కు అనుకూలించిన పిచ్పై ఆర్సీబీ వేగంగా పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. రాజస్తాన్ రాయల్స్ ముందు 206 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
టాస్ గెలిచిన ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ బ్యాటింగ్కు దిగింది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలించడంతో ఆర్సీబీ బ్యాటర్లు చెలరేగారు. కోహ్లీతో పాటు ఫిల్ సాల్ట్ (26) కూడా వేగంగా ఆడి తొలి వికెట్కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హసరంగా బౌలింగ్లో సాల్ట్ అవుట్ అయిన తర్వాత వచ్చిన పడిక్కళ్ (50) హాఫ్ సెంచరీ చేశాడు. కోహ్లీ, పడిక్కళ్ రెండో వికెట్కు 95 పరుగులు జోడించారు. వేగంగా ఆడే క్రమంలో ఆర్చర్ బౌలింగ్లో కోహ్లీ అవుటయ్యాడు. ఆ తర్వాత టిమ్ డేవిడ్ (23), జితేశ్ శర్మ (20) కీలక పరుగులు చేశారు.
ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. హసరంగా తప్ప మిగిలిన బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్లో గెలవాలంటే రాజస్తాన్ రాయల్స్ 206 పరుగులు చేయాల్సి ఉంది. మరి, రాజస్తాన్ బ్యాటర్లు ఎలా ఛేజింగ్ను పూర్తి చేశారో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..