IPL 2025 RCB vs RR: రాయల్స్ ఫైట్.. స్వంతమైదానంలో ఆర్సీబీకి సవాల్.. గెలుస్తారా
ABN , Publish Date - Apr 24 , 2025 | 05:13 PM
ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి ఐదింట్లో గెలిచింది. అయితే ఆ గెలిచిన ఐదు మ్యాచ్లు ప్రత్యర్థులు వేదికల్లో ఆడినవే. స్వంత మైదానం అయిన బెంగళూరులో ఆడిన మూడింట్లోనూ ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ రోజు స్వంతమైదానం అయిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్తో తలపడుతోంది.

ఈ ఐపీఎల్ (IPL 2025) సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)ది ఓ విచిత్రమైన సమస్య. ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి ఐదింట్లో గెలిచింది. అయితే ఆ గెలిచిన ఐదు మ్యాచ్లు ప్రత్యర్థుల వేదికల్లో ఆడినవే. స్వంత మైదానం అయిన బెంగళూరులో ఆడిన మూడింట్లోనూ ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ రోజు స్వంతమైదానం అయిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్తో తలపడుతోంది (RR vs RCB). ఈ మ్యాచ్లో విజయం సాధించి హోమ్ గ్రౌండ్లో కూడా సత్తా చాటాలని ఆర్సీబీ కృతనిశ్చయంతో ఉంది.
మరోవైపు గెలవాల్సిన రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలై దారుణ విమర్శలు ఎదుర్కొంటోంది రాజస్తాన్ రాయల్స్ జట్టు. చివరి ఓవర్లో కేవలం 9 పరుగులు కొట్టలేక రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం రెండే మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. సంజూ శాంసన్ గాయం కారణంగా ఈ మ్యాచ్లో ఆడేది లేనిది అనుమానంగా ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఆర్సీబీ, ఆర్ ఆర్ 33 సార్లు తలపడ్డాయి. అందులో 16 సార్లు ఆర్సీబీ విజేతగా నిలవగా, 14 సార్లు ఆర్ఆర్ గెలుపు సాధించింది.
సాధారణంగా చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్కు స్వర్గధామంగా ఉంటుంది. అయితే ఈ సీజన్లో పిచ్ అనూహ్యంగా బౌలర్లకు మద్దతుగా నిలుస్తోంది. పిచ్ స్లోగా మారి బ్యాటర్లను ఇబ్బంది పెడుతోంది. దీంతో ఈ పిచ్లో హైస్కోరింగ్ మ్యాచ్లు నమోదు కావడం లేదు. అలాగే ఆర్సీబీ బ్యాటర్లు ఈ పిచ్ మీద ఆడేందుకు ఇబ్బంది పడుతున్నారు. వేగంగా పరుగులు చేయలేకపోతున్నారు. మరి, ఈ మ్యాచ్లో అయిన ఆర్సీబీ విజయం సాధించి హోమ్ గ్రౌండ్ నెగిటివ్ సెంటిమెంట్ను తుడిచిపెట్టేస్తుందేమో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..