IPL 2025 PBKS vs LSG: ధర్మశాలలో పోరు.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే
ABN , Publish Date - May 04 , 2025 | 04:54 PM
రెండు జట్లు ఇప్పటికే అధికారికంగా ఈ సీజన్ ప్లే ఆఫ్స్కు దూరమయ్యాయి. మరో జట్టు కూడా అదే బాటలో సాగుతోంది. ఈ నేపథ్యంలో మరో కీలక పోరుకు ధర్మశాలకు వేదిక కానుంది. పంజాబ్ కింగ్స్ జట్టుతో లఖ్నవూ సూపర్ జెయింట్స్ టీమ్ ఈ రోజు ధర్మశాల వేదికగా పోటీ పడుతోంది.
ఐపీఎల్లో (IPL 2025) ఇప్పటికే 50కు పైగా మ్యాచ్లు పూర్తయ్యాయి. రెండు జట్లు ఇప్పటికే అధికారికంగా ఈ సీజన్ ప్లే ఆఫ్స్కు దూరమయ్యాయి. మరో జట్టు కూడా అదే బాటలో సాగుతోంది. ఈ నేపథ్యంలో మరో కీలక పోరుకు ధర్మశాలకు వేదిక కానుంది. పంజాబ్ కింగ్స్ జట్టుతో లఖ్నవూ సూపర్ జెయింట్స్ టీమ్ ఈ రోజు ధర్మశాల వేదికగా పోటీ పడుతోంది (PBKS vs LSG).

ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన పంజాబ్ ఆరు మ్యాచ్ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన లఖ్నవూ ఐదు మ్యాచ్ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు ఈ రోజు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ప్లే ఆఫ్స్కు మరింత చేరువ కావాలని ప్రయత్నిస్తున్నాయి.
పంజాబ్ జట్టు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్ మంచి ఫామ్లో ఉన్నారు. అలాగే ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా స్థిరంగా రాణిస్తున్నాడు. నేహల్ వధేరా, జాస్ ఇంగ్లీష్ కూడా కీలక పరుగులు చేస్తున్నారు. ఇక, బౌలింగ్ విభాగంలో అర్ష్దీప్ సింగ్, ఛాహల్, ఒమర్జాయ్ లైన్ అండ్ లెంగ్త్కు కట్టుబడి బౌలింగ్ చేస్తున్నారు. మరోవైపు ఓపెనర్లు మిచెల్ మార్ష్, మార్క్రమ్తో పాటు నికోలస్ పూరన్పైనే లఖ్నవూ ఎక్కువగా ఆధారపడుతోంది. వారి విఫలమైతే తర్వాతి వారు కూడా చేతులెత్తేస్తున్నారు.
తుది జట్లు:
లఖ్నవూ సూపర్ జెయింట్స్ (అంచనా): మిచెల్ మార్ష్, మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్, ఆయుష్ బదోనీ, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠీ, ఆవేష్ ఖాన్
ఇంపాక్ట్ సబ్: ప్రిన్స్ యాదవ్
పంజాబ్ కింగ్స్ (అంచనా): ప్రియాంశ్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్, జాస్ ఇంగ్లీస్, యన్సెన్, సూర్యాంశ్, ఒమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్, ఛాహల్
ఇంపాక్ట్ సబ్: అర్ష్దీప్ సింగ్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..