IPL 2025 MI vs RR: రాణించిన రోహిత్, రికెల్టన్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
ABN , Publish Date - May 01 , 2025 | 09:26 PM
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతోంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై టీమ్ భారీ స్కోరు సాధించింది.
ఐపీఎల్లో (IPL 2025) ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతోంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI vs RR), రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై టీమ్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (53), ర్యాన్ రికెల్టన్ (61) అర్ధశతకాలతో ముంబై భారీ స్కోరుకు బాటలు వేశారు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది.

టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముంబై టీమ్ బ్యాటింగ్కు దిగింది. తొలి రెండు ఓవర్లు కాస్త ఇబ్బంది పడిన ముంబై ఓపెనర్లు రోహిత్, రికెల్టన్ తమ జోరు చూపించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించి తొలి వికెట్కు 116 పరుగులు జోడించారు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (48), హార్దిక్ పాండ్యా (48) విలువైన పరుగులు చేశారు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో తీక్షణ, రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ తీశారు.
రాజస్తాన్ ముందు 218 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మరి, రాజస్తాన్ బ్యాటర్లు మరోసారి భారీ స్కోరును ఛేజింగ్ చేస్తారో లేదో చూడాలి. గత మ్యాచ్ ఛేజింగ్ కింగ్ వైభవ్ సూర్యవంశీ ముంబై బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ను ఎదుర్కొన్ని ఎలా పరుగులు చేస్తారో చూడాలి. ఈ మ్యాచ్లో ముంబై గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్తుంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..