IPL 2025 KKR vs PBKS: వర్షం కారణంగా మ్యాచ్ రద్ధు.. ఇరు జట్లకు చెరో పాయింట్
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:17 PM
వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దయింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఈ రోజు పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం మొదలు కావడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు.

వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దయింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఈ రోజు పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం మొదలు కావడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు.
ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (83) తో పాటు ప్రియాంశ్ ఆర్య (69) అద్భుతంగా రాణించడంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముందు భారీ లక్ష్యం ఉంచింది. పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది.
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో బౌలింగ్ చేసిన కేకేఆర్ బౌలర్లకు పంజాబ్ ఓపెనర్లు చుక్కలు చూపించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 120 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. వీరి భారీ భాగస్వామ్యాన్ని ఆండ్రూ రస్సెల్ విడదీశాడు. ప్రియాంశ్ ఆర్యను అవుట్ చేశాడు. ఇక, సెంచరీకు చేరువ అవుతన్న ప్రభ్సిమ్రన్ను వైభవ్ అరోరా పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత కాసేపటికే మ్యాక్స్వెల్ (7)ను వరుణ్ చక్రవర్తి బౌల్డ్ చేశాడు.
చివర్లో శ్రేయస్ అయ్యర్ (25) కీలక పరుగులు చేశాడు. చివర్లో కోల్కతా బౌలర్లు పుంజుకుని పంజాబ్ను కట్టడి చేశారు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. 202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా తొలి ఓవర్లో 7 పరుగులు చేసింది. ఆ సమయానికి గుర్జాబ్ 1, సునీల్ నరైన్ 4 పరుగులతో ఉన్నారు. ఆ సమయంలో వర్షం మొదలైంది. మధ్యలో తగ్గినట్టు కనిపించి మళ్లీ మొదలైంది. దీంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..