Share News

ఆఖరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ గెలుపు

ABN , Publish Date - Jan 06 , 2025 | 01:56 AM

విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా ఆదివారం అరుణాచల్‌ ప్రదేశ్‌ జట్టుతో జరిగిన తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 8 వికెట్లతో గెలిచింది...

ఆఖరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ గెలుపు

అహ్మదాబాద్‌: విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా ఆదివారం అరుణాచల్‌ ప్రదేశ్‌ జట్టుతో జరిగిన తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 8 వికెట్లతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అరుణాచల్‌.. స్పిన్నర్లు తనయ్‌ త్యాగరాజన్‌ (5/32), అనికేత్‌ రెడ్డి (4/14) ధాటికి 28.3 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటైంది. ఛేదనలో హైదరాబాద్‌ టీ20 తరహాలో ఆడి 12 ఓవర్లలోనే 100/2 స్కోరు చేసి నెగ్గింది. ఇక, గ్రూప్‌-సిలోని హైదరాబాద్‌ 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Updated Date - Jan 06 , 2025 | 01:57 AM