బుమ్రాకు ఐసీసీ అవార్డుల ప్రదానం
ABN , Publish Date - Feb 24 , 2025 | 02:57 AM
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గత ఏడాదికి ఐసీసీ ప్రకటించిన అవార్డులను అందుకున్నాడు. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం జరిగిన చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ప్రారంభానికి ముందు...

దుబాయ్: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గత ఏడాదికి ఐసీసీ ప్రకటించిన అవార్డులను అందుకున్నాడు. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం జరిగిన చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఐసీసీ ఈ అవార్డులను అతడికి ప్రదానం చేసింది. ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’, ‘టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారాలకు బుమ్రా ఎంపికైన సంగతి తెలిసిందే. వెన్ను గాయానికి లోనైన బుమ్రా చాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. అయితే ఈ అవార్డులను స్వీకరించేందుకు బుమ్రా ఇక్కడకు విచ్చేశాడు. ఆ రెండు పురస్కారాలతోపాటు 2024.. టెస్ట్, టీ20 జట్లకు ఎంపికైన బుమ్రా మొత్తం నాలుగింటిని అందుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..