రిత్విక్కు కాంస్యం
ABN , Publish Date - Feb 23 , 2025 | 03:58 AM
కాపెల్లె అంతర్జాతీయ చెస్ చాంపియన్షి్పలో తెలంగాణ గ్రాండ్మాస్టర్ రాజా రిత్విక్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు....

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): కాపెల్లె అంతర్జాతీయ చెస్ చాంపియన్షి్పలో తెలంగాణ గ్రాండ్మాస్టర్ రాజా రిత్విక్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. శనివారం ఫ్రాన్స్లో జరిగిన టోర్నీలో ఆరో సీడ్ రిత్విక్ 9 రౌండ్లలో 7 పాయింట్లు సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. బోయర్ మహేల్ (ఫ్రాన్స్) స్వర్ణం, ఇనియన్ పన్నీర్ సెల్వం (చెన్నై) రజతం దక్కించుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..