Overhydration Risks: అతిగా నీరు తాగితే కిడ్నీలకు ప్రమాదమా..
ABN, Publish Date - Sep 20 , 2025 | 10:24 PM
కొందరు రోజుకు 6 గ్లాసుల నీళ్లు తాగాలంటారు. మరికొందరు ఎనిమిది గ్లాసులు అంటారు. అసలు నీరు ఎక్కువగా తాగితే కిడ్నీలకు ప్రమాదమా అన్న సందేహం మీకెప్పుడైనా కలిగిందా? దీనికి వైద్యులు సవివరమైన సమాధానమే ఇస్తున్నారు
1/8
ఒంట్లో అతిగా నీరు పెరగడాన్ని ఓవర్హైడ్రేషన్ అంటారు. డీహైడ్రేషన్ వలెనే ఇది కూడా కిడ్నీలకు చేటు చేస్తుంది.
2/8
కిడ్నీలు కేవలం మలినాలను తొలగించడమే కాకుండా ఒంట్లో నీరు, మినరల్స్ మధ్య సమతౌల్యాన్ని కాపాడతాయి.
3/8
అతిగా నీరు తాగితే సోడియం శాతం తగ్గుతుంది. దీన్ని హైపోనాట్రేమియా అంటారు. ఇది కిడ్నీలపై ఒత్తిడి పెంచుతుంది.
4/8
రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలన్నది కచ్చితమైన నిబంధన కాదని నిపుణులు చెబుతున్నారు. నీటి అవసరాలు ఆయా వ్యక్తుల శారీరక తత్వం, జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది.
5/8
అతిగా నీరు తాగితే మెదడులో వాపు వచ్చి కన్ఫ్యూజన్ వంటివి వస్తాయి. ఒక్కోసారి ఫిట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.
6/8
అతిగా నీరు తాగే వారిలో కొందరికి కడుపుబ్బరం, నీరసం వంటి వస్తుంటాయి.
7/8
కిడ్నీ, గుండె, హార్మోన్ సమౌతౌల్యానికి సంబంధించిన సమస్యలు ఉన్న వారు అతిగా నీరు తాగితే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది.
8/8
కేవలం నీరు తాగకుండా ఎలక్ట్రోలైట్స్ ఉన్న డ్రింక్స్ లేదా నీరు అధికంగా ఉండే పండ్లను తినాలని నిపుణులు చెబుతున్నారు.-
Updated at - Sep 20 , 2025 | 10:24 PM