ప్రశాంతంగా ప్రారంభమైన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
ABN, Publish Date - Dec 11 , 2025 | 09:39 AM
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. ఒంటి గంట తర్వాతి నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సాయంత్రానికి ఫలితాలు వస్తాయి.
1/10
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్ మొదలైంది.
2/10
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంది.
3/10
ఒంటి గంట తర్వాతి నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సాయంత్రానికి ఫలితాలు వస్తాయి.
4/10
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 189 మండలాల్లోని 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది.
5/10
షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో 189 మండలాల పరిధిలో 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, అందులో 395 పంచాయతీల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి.
6/10
3,834 గ్రామ పంచాయతీలకు గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది.
7/10
మిగిలిన 5 గ్రామాల్లో ఒక్క నామినేషన్ దాఖలు కాకపోవటంతో పోలింగ్ జరగటం లేదు.
8/10
ఈ ఎన్నికల కోసం మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు 93,905 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.
9/10
తొలి విడతలో 3,834 సర్పంచ్ స్థానాల్లో 12,960 మంది, 27,628 వార్డు స్థానాల్లో 65,455 మంది పోటీపడుతున్నారు.
10/10
తొలి విడత పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది బుధవారమే మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సామగ్రి తీసుకుని తమకు కేటాయించిన గ్రామాలకు చేరుకున్నారు.
Updated at - Dec 11 , 2025 | 09:39 AM