Tiruchanur Padmavati Temple: ఘనంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు..
ABN, Publish Date - Nov 17 , 2025 | 10:22 AM
కార్తీక బ్రహ్మోత్సవాల కోసం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ముస్తాబయింది. విద్యుత్ దీపాల కాంతులతో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని చూడ్డానికి రెండు కళ్లు చాలటం లేదు.
1/10
కార్తీక బ్రహ్మోత్సవాల కోసం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ముస్తాబయింది.
2/10
విద్యుత్ దీపాల కాంతులతో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని చూడ్డానికి రెండు కళ్లు చాలటం లేదు.
3/10
కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుంచి 25 వరకు వైభవంగా జరుగనున్నాయి.
4/10
ప్రత్యేక వాహన సేవలు, పట్టు వస్త్ర సమర్పణ ప్రధాన ఆకర్షణ.
5/10
వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు ఈ రోజు అంకురార్పణ కార్యక్రమంతో శుభారంభం కానుంది.
6/10
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు.
7/10
సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు జరగనున్నాయి.
8/10
నవంబర్ 17 ఉదయం 8 నుండి 9 గంటల మధ్య ధ్వజస్తంభ తిరుమంజనం, అలంకార కార్యక్రమాలు జరుగుతాయి.
9/10
ఉదయం 9.15 నుంచి 9.30 గంటల మధ్య ధనుర్ లగ్నంలో ధ్వజారోహణం జరుగుతాయి.
10/10
ప్రతి సంవత్సరం అత్యంత ఆధ్యాత్మికంగా నిర్వహించే ఈ వేడుకలు భక్తులకు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తాయి.
Updated at - Nov 17 , 2025 | 10:22 AM