గుంటూరులో అట్టహాసంగా జాతీయ నృత్యపోటీలు.. భారీగా తరలివచ్చిన జనం
ABN, Publish Date - Dec 07 , 2025 | 06:39 PM
గుంటూరులో జాతీయ స్థాయి నృత్యపోటీలు వైభవంగా జరిగాయి. నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు.. దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన పలువురు నృత్యకారులు తమదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించారు.
1/8
గుంటూరులో జాతీయస్థాయి నృత్య పోటీలు వైభవంగా సాగాయి. నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరం ఈ కార్యక్రమానికి వేదికైంది.
2/8
నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డిసెంబర్ 6, 7వ తేదీలలో ఈ పోటీలు అట్టహాసంగా జరిగాయి.
3/8
రాధామాధవ రసరంజని, రాధామాధవ నాట్యక్షేత్రం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
4/8
'నాట్య నెలవంక సంబరం' పేరిట ఈ నృత్యపోటీలు జరిగాయి.
5/8
ఈ పోటీలలో దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన నృత్యకారులు పాల్గొన్నారు.
6/8
కృష్ణుడి వేషధారణతో పాటు గోపికలు చేసిన నృత్యం వంటివి ప్రేక్షకులను అలరించాయి.
7/8
ఈ నృత్యంలో గిరిజన నృత్యకారులు తమదైన శైలిలో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు.
8/8
రెండు రోజుల పాటు అంగరంగవైభవంగా సాగిన ఈ నృత్యపోటీలను తిలకించేందుకు భారీఎత్తున జనం తరలివచ్చారు.
Updated at - Dec 07 , 2025 | 06:39 PM