Grand Pushpaharam Ceremony: తిరుమలలో ఘనంగా పుష్పయాగం..

ABN, Publish Date - Oct 30 , 2025 | 06:32 PM

తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగం అంగరంగ వైభవంగా జరిగింది. పుష్ప యాగానికి బుధ‌వారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. పుష్పయాగం సంద‌ర్భంగా ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహించారు.

Grand Pushpaharam Ceremony: తిరుమలలో ఘనంగా పుష్పయాగం.. 1/10

తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగం అంగరంగ వైభవంగా జరిగింది.

Grand Pushpaharam Ceremony: తిరుమలలో ఘనంగా పుష్పయాగం.. 2/10

పుష్పయాగానికి బుధ‌వారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది.

Grand Pushpaharam Ceremony: తిరుమలలో ఘనంగా పుష్పయాగం.. 3/10

పుష్పయాగం సంద‌ర్భంగా ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహించారు.

Grand Pushpaharam Ceremony: తిరుమలలో ఘనంగా పుష్పయాగం.. 4/10

స్నపనతిరుమంజనంలో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ‌ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.

Grand Pushpaharam Ceremony: తిరుమలలో ఘనంగా పుష్పయాగం.. 5/10

మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహించారు.

Grand Pushpaharam Ceremony: తిరుమలలో ఘనంగా పుష్పయాగం.. 6/10

సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.

Grand Pushpaharam Ceremony: తిరుమలలో ఘనంగా పుష్పయాగం.. 7/10

ఈ నేపథ్యంలో ఆర్జితసేవలైన తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత‌ బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.

Grand Pushpaharam Ceremony: తిరుమలలో ఘనంగా పుష్పయాగం.. 8/10

లోక కళ్యాణార్థం 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపిన టీటీడీ ఈవో అనిల్ కుమార్

Grand Pushpaharam Ceremony: తిరుమలలో ఘనంగా పుష్పయాగం.. 9/10

అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శోభాయమానంగా పుష్పయాగం

Grand Pushpaharam Ceremony: తిరుమలలో ఘనంగా పుష్పయాగం.. 10/10

శ్రీవారి పుష్పయాగానికి తమిళనాడు నుంచి 5 టన్నులు, కర్ణాటక నుంచి 2 టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుండి 2 టన్నులు కలిపి మొత్తం 9 టన్నుల పుష్పాలను దాతలు విరాళం ఇచ్చారు.

Updated at - Oct 30 , 2025 | 06:38 PM