పదో తరగతి పరీక్షలు ప్రారంభం
ABN, Publish Date - Mar 17 , 2025 | 11:36 AM
జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
1/7
పకడ్బందీ ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు 21,248 మంది విద్యార్థులకు 118 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
2/7
చిత్తూరు సెంట్రల్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
3/7
ఈ పరీక్షలకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు.
4/7
దూర ప్రాంత విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు.
5/7
పరీక్ష కేంద్రాల వద్ద 163వ సెక్షన్ అమలులో ఉంటుందని ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరి తెలిపారు.
6/7
కేంద్రాల వద్ద జెరాక్స్ కేంద్రాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
7/7
వీరిలో బాలురు 11,005 మంది, బాలికలు 10,243 మంది ఉన్నారు. వీరికోసం 118 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 11 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
Updated at - Mar 17 , 2025 | 11:41 AM