Share News

వివేకం కోల్పోతే...

ABN , Publish Date - May 02 , 2025 | 03:59 AM

భర్తృహరి ‘నీతి శతకం’లోని ‘శిరః శార్వం స్వర్గాత్పశుపతి శిరస్తః క్షితిధరం...’ అనే అనే శ్లోకాన్ని ఏనుగు లక్ష్మణకవి తెలుగువారికి పై పద్య రూపంలో అందించారు...

వివేకం కోల్పోతే...

సుభాషితం

ఆకాశంబుననుండి శంభుని శిరం బందుండి శీతాద్రి సు

శ్లోకంబైన హిమాద్రినుండి భువి భూలోకంబునందుండి య

స్తోకాంభోధి బయోధినుండి పవనాంధోలోకముం జేరె గం

గాకూలంకష పెక్కుభంగులు వివేకభ్రష్ట సంపాతముల్‌

భర్తృహరి ‘నీతి శతకం’లోని ‘శిరః శార్వం స్వర్గాత్పశుపతి శిరస్తః క్షితిధరం...’ అనే అనే శ్లోకాన్ని ఏనుగు లక్ష్మణకవి తెలుగువారికి పై పద్య రూపంలో అందించారు.

భావం: స్వర్గ లోకంలో ఉండే గంగానది ఆకాశం నుంచి పరమశివుడి శిరస్సుపైకి ఉరికింది. అక్కడి నుంచి హిమాలయాల మీదకు దూకింది. ఆ తరువాత భూమిపైకి చేరింది. సముద్రంలో కలిసింది. చివరకు పాతాళ లోకానికి జారింది. వివేకాన్ని కోల్పోయినవారి తీరు పలు విధాలుగా ఉంటుంది. వారికి ఇటువంటి ఇక్కట్లు తప్పవు. వారు అధఃపాతాళానికి దిగజారిపోతారు.

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 02 , 2025 | 03:59 AM