Chhattisgarh encounter: ఛత్తీ్సగఢ్లో ఇద్దరు నక్సల్స్ ఎన్కౌంటర్
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:58 AM
ఛత్తీస్గఢ్లోని కొండగావ్, నారాయణపూర్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలంలో నుంచి ఏకే-47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చర్ల, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్సగఢ్ రాష్ట్రంలో మరోమారు తుపాకీ గర్జించింది. కొండగావ్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఏకే-47 తుపాకులను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు రెండు జిల్లాల సరిహద్దులోని బార్గమ్ అడవుల్లో కూంబింగ్ చేపట్టిన క్రమంలో నక్సల్స్ కాల్పులకు దిగినట్లు వివరించారు. మృతులను డీవీసీఎం సభ్యుడు హల్దార్ (రూ.8 లక్షల రివార్డు), ఏరియా కమిటీ సభ్యుడు రాము(రూ.5 లక్షల రివార్డు) ఉన్నట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...