Share News

CBDT Telugu Member: తెలుగు అధికారికి సీబీడీటీలో స్థానం

ABN , Publish Date - Apr 19 , 2025 | 03:25 AM

తెలుగు ఐఆర్‌ఎస్‌ అధికారి ఎల్‌. రాజశేఖర్‌రెడ్డి సీబీడీటీలో సభ్యునిగా నియమితులయ్యారు. మరొకసారి కేంద్ర స్థాయిలో తెలుగు ప్రతినిధిత్వానికి గుర్తింపు లభించింది

CBDT Telugu Member: తెలుగు అధికారికి సీబీడీటీలో స్థానం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రత్యక్షపన్నుల బోర్డు(సీబీడీటీ)లో ఖాళీగా ఉన్న పదవులలో నలుగురు ఐఆర్‌ఎస్‌ అధికారులను కేబినెట్‌ నియామకాల కమిటీ నియమించింది. పంకజ్‌కుమార్‌ మిశ్రా, సంజయ్‌ బహదూర్‌, ఎల్‌.రాజశేఖర్‌ రెడ్డి, జి.అపర్ణరావు సీబీడీటీలో సభ్యులుగా నియమితులయ్యారు. కాగా, ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన ఎల్‌.రాజశేఖర్‌రెడ్డి తెలుగువ్యక్తి కావడం విశేషం. ఆయన ఇదివరకు ఆదాయ పన్ను ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా చెన్నైలో బాధ్యతలు నిర్వర్తించారు.

Updated Date - Apr 19 , 2025 | 03:25 AM