Share News

Teacher Eligibility Test: టెట్‌ నుంచి టీచర్లకు కేంద్రం రక్షణ కల్పించాలి

ABN , Publish Date - Sep 15 , 2025 | 04:51 AM

ఐదేళ్లు పైబడి సర్వీసున్న ఇన్‌ సర్వీస్‌ టీచర్లందరూ రెండేళ్లలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఉత్తీర్ణులు కావాలని, లేదంటే ఉద్యోగాన్ని వదులుకోవాలని ఇటీవలే సుప్రీం కోర్టు...

Teacher Eligibility Test: టెట్‌ నుంచి టీచర్లకు కేంద్రం రక్షణ కల్పించాలి

  • ఎస్టీఎ్‌ఫఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లు పైబడి సర్వీసున్న ఇన్‌ సర్వీస్‌ టీచర్లందరూ రెండేళ్లలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఉత్తీర్ణులు కావాలని, లేదంటే ఉద్యోగాన్ని వదులుకోవాలని ఇటీవలే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దీని నుంచి సీనియర్‌ టీచర్లకు రక్షణ కల్పించాలని స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్టీఎ్‌ఫఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి, టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దీని కోసం విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 23ను సవరించాలని, అదేవిధంగా టెట్‌ సిలబస్‌, అర్హత ప్రమాణాలను శాస్ర్తీయంగా సవరించాలని ఎన్‌సీటీఈని డిమాండ్‌ చేశారు. దోమలగూడలోని టీఎ్‌సయూటీఎఫ్‌ కార్యాలయంలో ఆదివారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో చావ రవి మాట్లాడారు. 23.08.2010కి ముందు నియామకమైన టీచర్లకు టెట్‌ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 15 ఏళ్ల తర్వాత హఠాత్తుగా రెండేళ్లలో టెట్‌ పాస్‌ కావాలంటే సీనియర్‌ టీచర్లు ఆందోళన చెందుతున్నారన్నారు. దీన్ని నివారించడానికి తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలని కోరారు.

Updated Date - Sep 15 , 2025 | 04:51 AM