Pahalgam Terror Attack: వీసాల రద్దు.. సీమా హైదర్ పాకిస్తాన్ వెళ్లిపోవాల్సిందేనా..
ABN , Publish Date - Apr 24 , 2025 | 05:54 PM
Seema Haider: పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్ 2023లో ప్రియుడు సచిన్ కోసం ఇండియాకు వచ్చేసింది. తన నలుగురు పిల్లల్ని వెంట బెట్టుకుని నేపాల్ మీదుగా అక్రమంగా ఇండియాలోకి వచ్చింది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి గత మార్చినెలలోఓ పాప కూడా పుట్టింది.

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తానీలకు వీసాలను రద్దు చేసింది. ఏప్రిల్ 27వ తేదీ నుంచి పాకిస్థానీల వీసాలు రద్దు అవుతాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. 48 గంటల్లో పాకిస్తానీలు ఇండియా వదలి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇక, మెడికల్ వీసాలు 29వ తేదీన రద్దు అవుతాయని, డెడ్ లైన్ కంటే ముందే పాకిస్తానీలు వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. ప్రియుడి కోసం దొంగతనంగా ఇండియాలోకి వచ్చిన సీమా హైదర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ప్రియుడి కోసం పాకిస్తాన్ నుంచి..
పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్కు చెందిన సీమా హైదర్కు 2019లో ఆన్లైన్ గేమ్ ద్వారా ఉత్తర ప్రదేశ్, నోయిడాకు చెందిన సచిన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా తర్వాతి కాలంలో ప్రేమగా మారింది. సీమా హైదర్కు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. అయినా కూడా ప్రియుడి కోసం ఇండియా రావాలని నిశ్చయించుకుంది. 2023లో నలుగురు పిల్లల్ని వెంట బెట్టుకుని నేపాల్ మీదుగా ఇండియాలోకి అక్రమంగా వచ్చేసింది. పోలీసులు అరెస్ట్ చేయటం తర్వాత విడుదల చేయటం వెంట వెంటనే జరిగిపోయాయి.
ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. గత మార్చినెలలో వీరికి ఓ ఆడపిల్ల పుట్టింది. వీసాల రద్దు నేపథ్యంలో సీమా హైదర్ తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈమె గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీమా హైదర్ ఇండియాలో ఉంటుందా? లేదా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇండియన్ సిటిజెన్ను పెళ్లి చేసుకుని, ఓ బిడ్డను కన్న సీమా హైదర్కు ఇండియాలో ఉండే హక్కు ఉంటుందా? లేదా? అన్నది క్వచ్చన్ మార్క్. ఒక వేళ ఆమెను పాకిస్తాన్కు తిరిగిపంపిస్తే.. ఆ బిడ్డ పరిస్థితి ఏంటి?.. ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి..
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..
Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్