Share News

Children Using Substances: మత్తు అడ్డాలుగా విద్యాలయాలు

ABN , Publish Date - Dec 11 , 2025 | 04:35 AM

జ్ఞాన వనాలుగా ఉండాల్సిన విద్యాలయాలు గంజాయి వనాలుగా మారుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. స్కూలుకు వెళ్లే పిల్లలు 12.9 ఏళ్లకే మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని....

Children Using Substances: మత్తు అడ్డాలుగా విద్యాలయాలు

  • పదకొండేళ్లకే పిల్లల్లో డ్రగ్స్‌ వినియోగం

  • గోప్యంగా సర్వే జరిపిన మెడికల్‌ బృందాలు

  • ప్రతి ఏడు స్కూళ్లలో ఒకచోట డ్రగ్స్‌ భూతం

న్యూఢిల్లీ, డిసెంబరు 10: జ్ఞాన వనాలుగా ఉండాల్సిన విద్యాలయాలు గంజాయి వనాలుగా మారుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. స్కూలుకు వెళ్లే పిల్లలు 12.9 ఏళ్లకే మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని, కొందరైతే పదకొండేళ్లు వచ్చేటప్పటికే మత్తుకు బానిసలు అవుతున్నారంటూ ఈ అధ్యయనం మన విద్యావ్యవస్థపై ప్రమాద ఘంటికలు మోగించింది. హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, లఖ్‌నవూ, చండీగఢ్‌, ఇంఫాల్‌, జమ్మూ, దిబ్రూగఢ్‌, రాంచీ నగరాల పరిధిలో సగటున 14.7 ఏళ్ల వయసు కలిగిన 5,920 మంది విద్యార్థులపై గోప్య పద్ధతిలో ఈ అధ్యయనం సాగింది. దానిని నివేదిక రూపంలో నేషనల్‌ మెడికల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రచురించారు. ‘మీరు డ్రగ్స్‌ తీసుకుంటారా’ అని బహిరంగంగా మమ్మల్ని అడిగితే లేదనే మేం సమాధానం చెబుతాం’ అని తాము కలిసిన విద్యార్థుల్లో ఎక్కువమంది తెలిపారని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఢిల్లీ, ఎయిమ్స్‌లోని నేషనల్‌ డ్రగ్‌ డిపెండెన్స్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్‌ అధిపతి డాక్టర్‌ అంజూ ఽధావన్‌ తెలిపారు. చండీగఢ్‌, దిబ్రూగఢ్‌, లఖ్‌నవూ, బెంగళూరు, శ్రీనగర్‌, ఇంఫాల్‌, ముంబై, హైదరాబాద్‌, రాంచీలకు చెందిన వైద్య కళాశాలలకు చెందిక బృందాలు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నాయి. అధ్యయనం జరిపిన ప్రతి ఏడు స్కూళ్లలో కనీసం ఒకచోట విద్యార్థులు కనీసం ఒక్కసారైనా తాము డ్రగ్స్‌ తీసుకున్నట్టు తెలిపారు. మగపిల్లలు పొగాకు ఉత్పత్తులు, గంజాయి అధికంగా తీసుకుంటే, ఆడపిల్లలు నల్లమందు గోలీలు, ఇతర మాదక ద్రవ్యాలు ఎక్కువగా వాడుతున్నారు.

Updated Date - Dec 11 , 2025 | 04:35 AM