Share News

Maoists Encounter: ఝార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌..ముగ్గురు నక్సలైట్ల మృతి

ABN , Publish Date - Jul 27 , 2025 | 06:26 AM

ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మరణించారు.

Maoists Encounter: ఝార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌..ముగ్గురు నక్సలైట్ల మృతి

గుమ్లా, జూలై 26: ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మరణించారు. వారిని సీపీఎం(మావోయిస్టులు) నుంచి విడిపోయిన ఝార్ఖండ్‌ జన ముక్తి పరిషత్‌ (జేజేఎంపీ) సభ్యులుగా పోలీసులు గుర్తించారు. ఘాగ్రా పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లో నక్సలైట్లు తలదాచుకున్నట్లు తమకు ఇంటెలిజెన్స్‌ సమాచారం అందిందని గుమ్లా ఎస్పీ హారిస్‌ తెలిపారు. ఝార్ఖండ్‌ జాగ్వర్‌ బలగాలు, గుమ్రా పోలీసుల సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టాయన్నారు. బలగాల రాకను గుర్తించిన నక్సలైట్లు.. కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేశారన్నారు. ఈ క్రమంలో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందగా, మరో ఇద్దరు పరారయ్యారని చెప్పారు.

Updated Date - Jul 27 , 2025 | 06:28 AM