Sudarshan Reddy Case: ఉప రాష్ట్రపతిగా మాజీ జడ్జి పోటీయే సరికాదు
ABN , Publish Date - Aug 27 , 2025 | 03:08 AM
పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేయడం సరైంది...
న్యూఢిల్లీ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేయడం సరైంది కాదని మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ పి. సదాశివం, జస్టిస్ రంజన్ గొగోయ్తోపాటు 56 మంది విశ్రాంత న్యాయమూర్తులు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి సల్వాజుడుం కేసులో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పలువురు మాజీ న్యాయమూర్తులు విడుదల చేసిన ప్రకటనను వీరు తీవ్రంగా తప్పుబట్టారు.