Share News

India-China relations: భారత్‌తో కలిసి పనిచేస్తాం

ABN , Publish Date - Apr 10 , 2025 | 04:43 AM

భారత్‌తో సరిహద్దుల వద్ద శాంతి, స్థిరత కోసం కలిసి పనిచేయడానికి తమ సైన్యం సిద్ధంగా ఉందని చైనా ప్రకటించింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తైన సందర్భంలో ఈ ప్రకటన వెలువడింది.

India-China relations: భారత్‌తో కలిసి పనిచేస్తాం

బీజింగ్‌, ఏప్రిల్‌ 9: సరిహద్దుల వద్ద శాంతి, సుస్థిరత నెలకొల్పేందుకు భారత్‌తో కలిసి పనిచేసేందుకు తమ సైన్యం సిద్ధమని చైనా ప్రకటించింది. రెండు దేశాల సైనిక భవిష్యత్‌ సంబంధాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝాంగ్‌ జియావోగాంగ్‌ స్పందిస్తూ ఈ విషయం చెప్పారు. అత్యంత పురాతన నాగరికతలు కలిగి ఉన్న ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో గ్లోబల్‌ సౌత్‌లో ముఖ్యమైన స్థానాలను ఆక్రమించాయన్నారు. ప్రజల ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.


ఇవి కూడా చదవండి..

Tahwwur Rana: భారత్‌కు 26/11 పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా.. ప్రత్యేక విమానంలో తరలింపు

Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..

Updated Date - Apr 10 , 2025 | 04:43 AM