BJP: తెలంగాణ కులగణన విశ్లేషణలో ఫ్రాన్స్ ఆర్థికవేత్త ఎందుకు?
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:35 AM
కీలకమైన సామాజిక సమాచారాన్ని విదేశీయులకు ఎలా అందుబాటులో ఉంచుతారని ప్రశ్నించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సుధాంశు త్రివేది శనివారం ఇక్కడ మాట్లాడుతూ దేశంలో చాలా మంది నిపుణులు ఉండగా, విదేశీ ఆర్థికశాస్త్రవేత్తను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నియమించిందని ప్రశ్నించారు.

సున్నితమైన సమాచారాన్ని విదేశీయులకు ఇస్తారా?
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రశ్న
న్యూఢిల్లీ, మార్చి 15: తెలంగాణలో చేపట్టిన కులగణన సమాచారాన్ని విశ్లేషించడానికి ఏర్పాటయిన నిపుణుల బృందంలో ఫ్రెంచి ఆర్థికశాస్త్రవేత్త థామస్ పికెట్టీని నియమించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. కీలకమైన సామాజిక సమాచారాన్ని విదేశీయులకు ఎలా అందుబాటులో ఉంచుతారని ప్రశ్నించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సుధాంశు త్రివేది శనివారం ఇక్కడ మాట్లాడుతూ దేశంలో చాలా మంది నిపుణులు ఉండగా, విదేశీ ఆర్థికశాస్త్రవేత్తను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నియమించిందని ప్రశ్నించారు. ఎంతోమంది భారతీయులు ఎన్నో విదేశీ సంస్థలకు ఆధిపత్యం వహిస్తుండగా, ఒక విదేశీయుడ్ని నియమించాల్సిన అవసరం ఏముందని అన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి ఆఽధ్వర్యంలో ఏర్పాటయిన 11 మంది సభ్యుల కమిటీలో పికెట్టీ సభ్యుడిగా ఉన్నారు. ఆయన ఆర్థిక అసమానతలపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. పన్నుల విధానంపై ఆయన చేసిన సూచనలు ఉద్యోగులు, మధ్యతరగతి వారికి హాని కలిగించేవిగా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయని త్రివేది గుర్తు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థపై విమర్శలు చేస్తున్న విదేశీ శక్తులతో కాంగ్రెస్ చేతులు కలుపుతోందని ఆరోపించారు. దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండు చేశారు. బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ భారత్లో మంచేమీ లేదని చెప్పడం కాంగ్రె్సకు అలవాటేనని వ్యాఖ్యానించారు. భారత్ సొంతంగా పరిపాలించుకోలేదు, సొంతంగా ఆలోచించుకోలేదు, సొంతంగా రక్షించుకోలేదన్నదే కాంగ్రెస్ ఉద్దేశమని విమర్శించారు. సున్నితమైన జనాభా సమాచారంపై విదేశీయులు వారి అవసరాలకు అనుగుణంగా తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తే బాఽధ్యులు ఎవరని ప్రశ్నించారు.