Asim Munir: పాక్ సైన్యాధిపతికి త్రివిధ దళాలపై పెత్తనం!
ABN , Publish Date - Nov 09 , 2025 | 01:28 AM
అత్యున్నత స్థాయిలో త్రివిధ దళాల సమన్వయానికి పాకిస్థాన్ కొత్తగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ సీడీఎఫ్ అనే పదవిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది....
కొత్తగా సీడీఎఫ్ పదవి ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం.. సెనేట్లో బిల్లు
ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేతుల్లో మరింత అధికారం
ఇస్లామాబాద్, నవంబరు 8: అత్యున్నత స్థాయిలో త్రివిధ దళాల సమన్వయానికి పాకిస్థాన్ కొత్తగా ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్’ (సీడీఎఫ్) అనే పదవిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సైన్యాధిపతికే ఈ బాధ్యతలు కూడా అప్పగించనుంది. శనివారం ఆ దేశ క్యాబినెట్ ఈ నిర్ణయాన్ని ఆమోదించిన నేపథ్యంలో.. రాజ్యాంగంలో సైనికదళాలకు సంబంధించిన ఆర్టికల్ 243లో సవరణలు ప్రతిపాదిస్తూ అధికారపక్షం.. పార్లమెంటు ఎగువసభ సెనేట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. దీనిప్రకారం ప్రధానమంత్రి సలహా మేరకు ఆర్మీ చీఫ్ను/ సీడీఎ్ఫను దేశాధ్యక్షుడు నియమిస్తారు. సీడీఎఫ్ ప్రధానితో సంప్రదింపులు జరిపి జాతీయవ్యూహాత్మక కమాండ్ అధిపతిని నియమిస్తారు. కాగా, ప్రస్తుత ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేతుల్లో మరింత అధికారాన్ని కేంద్రీకృతం చేయటంలో భాగంగానే ఈ బిల్లును తెచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో భారత్తో యుద్ధం అనంతరం, పాక్ ప్రభుత్వం ఆయనకు ఫీల్డ్మార్షల్గా పదోన్నతి కల్పించిన సంగతి తెలిసిందే.