Share News

Family Dispute: 9 మందిని పొడిచి చంపేశాడు!

ABN , Publish Date - Dec 29 , 2025 | 01:03 AM

కుటుంబంలో గొడవతో నియంత్రణ కోల్పోయిన ఓ వ్యక్తి విచ్చలవిడిగా కత్తితో దాడికి దిగాడు. తన ఇంట్లోని వారితోపాటు పొరుగున ఉన్న పలు ఇళ్లలోకి చొరబడి మరీ కత్తిపోట్లకు పాల్పడ్డాడు.

 Family Dispute: 9 మందిని పొడిచి చంపేశాడు!

  • కుటుంబ గొడవలతో సూరినామ్‌లో విచక్షణారహితంగా ఓ వ్యక్తి కత్తి పోట్లు

  • సొంత పిల్లలు సహా పొరుగిళ్లలో ఉండే తొమ్మిది మందిపై దాడి చేసి హత్య

పరమరిబో (సురినామ్‌), డిసెంబరు 28: కుటుంబంలో గొడవతో నియంత్రణ కోల్పోయిన ఓ వ్యక్తి విచ్చలవిడిగా కత్తితో దాడికి దిగాడు. తన ఇంట్లోని వారితోపాటు పొరుగున ఉన్న పలు ఇళ్లలోకి చొరబడి మరీ కత్తిపోట్లకు పాల్పడ్డాడు. దీనితో 9మంది మరణించగా.. అందులో ఆ వ్యక్తి సొంత పిల్లలు సహా ఐదుగురు చిన్నారులు ఉండటం దారుణం. సురినామ్‌ దేశ రాజధాని పరమరిబోలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. మరో చిన్నారి, ఇంకొకరు తీవ్రంగా గాయపడ్డారు. కత్తితో దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకుని,ఆ వ్యక్తిపై కాల్పులు జరిపారు. అతడి కాళ్లలో బుల్లెట్లు దిగాయని పోలీసులు వెల్లడించారు.

Updated Date - Dec 29 , 2025 | 01:03 AM