Share News

Microsoft Employees: ఇజ్రాయెల్‌తో సంబంధాలు తెంచుకోవాలి

ABN , Publish Date - Aug 22 , 2025 | 06:57 AM

అమెరికా వాషింగ్టన్‌లోని రెడ్‌మండ్‌ మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో పాలస్తీనీయన్లకు మద్దతుగా నిరసనకు దిగిన ఆ కంపెనీకి చెందిన 18 మంది ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు.

Microsoft Employees: ఇజ్రాయెల్‌తో సంబంధాలు తెంచుకోవాలి

  • అమెరికాలో మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కార్యాలయం వద్ద నిరసనలు

వాషింగ్టన్‌, ఆగస్టు 21: అమెరికా వాషింగ్టన్‌లోని రెడ్‌మండ్‌ మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో పాలస్తీనీయన్లకు మద్దతుగా నిరసనకు దిగిన ఆ కంపెనీకి చెందిన 18 మంది ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. మైక్రోసాఫ్ట్‌ రూపొందించిన సాంకేతికతను వాడుకొనే గాజాలో ఇజ్రాయెల్‌ మారణహోమానికి పాల్పడుతోందంటూ 35మందితో కూడిన బృందం రెండు రోజులుగా ఈ ఆందోళనలు చేపట్టింది. ఇజ్రాయెల్‌తో మైక్రోసాఫ్ట్‌ వ్యాపార సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ నేపథ్యంలోనే కంపెనీ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని వెళ్లిపోవాలని సూచించినా వెనక్కి తగ్గలేదు. మైక్రోసాఫ్ట్‌ బోర్డుపై రంగులు పూసి నినాదాలతో హోరెత్తించారు. దీంతో 18 మంది ఉద్యోగులను పలు అభియోగాల కింద పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - Aug 22 , 2025 | 07:00 AM