Today Horoscope: ఈ రాశి వారు పెట్టుబడులపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి
ABN , Publish Date - Jun 18 , 2025 | 12:56 AM
నేడు 18-06-2025 బుధవారం, ఉదయం దూర ప్రాంతంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు...

నేడు 18-06-2025 బుధవారం, ఉదయం దూర ప్రాంతంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఉదయం దూర ప్రాంతంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు. వీసా, పాస్పోర్ట్ వ్యవహారాలు పూర్తి చేస్తారు. మధ్యాహ్నం నుంచి విదేశీ విద్య కోసం చే సే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. డ్రైవింగ్లో నిదానం అవసరం. గణపతిని ఆరాధించండి.
వృషభం (ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఉదయం బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం నుంచి పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితులు మొహమాటపెట్టే అవకాశం ఉంది. శ్రీ రామచంద్ర మూర్తిని ఆరాధించండి.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఉదయం ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి మీ గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగే ప్రమాదం ఉంది. పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. పైఅధికారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఉదయం బంధుమిత్రులను కలుసుకుంటారు. లక్ష్యాలు సాధిస్తారు. మధ్యాహ్నం నుంచి మీ అంచనాలు ఫలించకపోవచ్చు. రాజకీయాలు, ప్రచురణలు, న్యాయ, బోధన, రవాణా, సాంస్కృతిక రంగాల వారు ఆచితూచి ముందడుగు వేయాలి. దూర ప్రయాణాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. మహాగణపతిని ఆరాధించండి.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఉదయం పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. మధ్యాహ్నం నుంచి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వారసత్వ వ్యవహారాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఉన్నత విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటు కావడంలో సమస్యలు ఎదురవుతాయి. శ్రీ రామచంద్ర మూర్తిని ఆరాధించండి.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఉదయం బందుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం నుంచి శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆవేదన కలిగస్తుంది. పెట్టుబడులపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. స్పెక్యులేషన్లు, పందాలు, పోటీలకు దూరంగా ఉండాలి. ఖర్చులు అంచనాలు మించుతాయి. శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఉదయం ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. మధ్యాహ్నం నుంచి ఉద్యోగ ప్రయత్నాలకు ఆంటకాలు ఎదురవుతాయి. లక్ష్య సాధనలో సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. ఆహారం విషయంలో పరిమితి పాటించండి. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. గణేశ స్తోత్ర పారాయణ శుభప్రదం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఉదయం పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. మధ్యాహ్నం నుంచి ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. షాపింగ్లో నాణ్యత గమనించండి. ఖర్చులు అధికం. శ్రీ రామచంద్ర మూర్తిని ఆరాధించండి.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఉదయం ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మరమ్మతులకు వెచ్చిస్తారు. మధ్యాహ్నం నుంచి గృహ నిర్మాణం, స్థలసేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటు కావడంతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
మధ్యాహ్నం వరకు మార్కెటింగ్, రవాణా, బోదన రంగాల వారికి అపుకూలంగా ఉంటుంది. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. మధ్యాహ్నం తరువాత వృత్తిపరమైన చర్చలు, ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలమైన రోజు కాదు. లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారం లోపిస్తుంది. శ్రీ రామ రక్షాస్తోత్ర పారాయణ శుభప్రదం.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఉదయం పెట్టుబడులు, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. మధ్యాహ్నం నుంచి ఆర్థిక విషయాల్లో అచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఫీజులు, బిల్లుల చెల్లింపు కోసం అవసరమైన నిధులు సకాలంలో సర్దుబాటు కాకపోవచ్చు. పందాలు, పోటీలకు దూరంగా ఉండాలి. ఖర్చులు అధికం. శ్రీ రామచంద్ర మూర్తి ఆరాధన శుభప్రదం.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఉదయం మార్పులు, బదిలీలు, ఆనందం కలిగిస్తాయి. మధ్యాహ్నం నుంచి కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. మనశ్శాంతి లోపిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. తల్లిందండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. మహాగణపతిని ఆరాధించండి.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ