Today Horoscope: ఈ రాశి వారు ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు.
ABN , Publish Date - Nov 08 , 2025 | 01:00 AM
విలువైన పత్రాలు అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు సమావేశాలు ఫలిస్తాయి....
నేడు రాశిఫలాలు 8-11-2025- శనివారం, విలువైన పత్రాలు అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు సమావేశాలు ఫలిస్తాయి.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
విలువైన పత్రాలు అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు సమావేశాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సన్నిహితుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు లక్ష్య సాధనలో అధికంగా శ్రమించాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

వృషభం ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మధ్యాహ్నం తరువాత షేర్మార్కెట్ లావాదేవీల్లో అప్రమత్తత అవసరం. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మహావిష్ణువును ఆరాధించండి.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
కొత్త ప్రాజెక్టులు చేపట్టి విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మధ్యాహ్నం తరువాత సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. విందు వినోదాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
సినిమాలు, రాజకీయాలు, టెలివిజన్, ఎగుమతుల రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. మధ్యాహ్నం తరువాత విదేశీ చదువుల కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ప్రచురణలు, ఆడిటింగ్ రంగాల వారికి కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది.

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఇంట్లో వేడుకలు, శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు. మధ్యాహ్నం తరువాత ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల లోపిస్తుంది. ఖర్చులు అధికం. మహావిష్ణువును ఆరాధించండి.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
పెద్దలతో చర్చలు, ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. మధ్యాహ్నం నుంచి లక్ష్య సాధనలో పెద్దల నుంచి ఆటంకాలు ఎదురవుతాయి. ఒక సమాచారం కలవరపెడుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఉన్నత చదువులు విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఉదయం 9 గంటల తరువాత న్యాయ, బోధన, ప్రచురణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో అనుకోని అవాంతరులు ఎదురయ్యే అవకాశం ఉంది. విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. మధ్యాహ్నం తరువాత బీమా, పన్నులు, పెన్షన్ వ్యవహారాల్లో ఆటంకాలు ఎ దురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. మరమ్మతులు, హార్డ్వేర్ రంగాల వారికి అనుకూలం. మహావిష్ణువును ఆరాధించండి.

ధనుస్పు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతికి సంబంధించిన విషయాల్లో శుభపరిణామాలు సంభవం. వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. మధ్యాహ్నం తరువాత సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. సన్నిహితుల వైఖరి బాధిస్తుంది. న్యాయవివాదాలు ఇబ్బంది పెడతాయి. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మధ్యాహ్నం తరువాత ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లోపిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. మహావిష్ణువును ఆరాధించండి.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
చిన్నారుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. సృజనాత్మకంగా వ్యవహరించి ఉద్యోగ వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. మధ్యాహ్నం నుంచి క్రీడలు, విద్య, ఆడిటింగ్, టెలివిజన్ రంగాల వారు పెద్దల నుంచి ఇబ్బందుల ఎదుర్కొంటిరు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటారు. మధ్యాహ్నం తరువాత కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ వ్యవహారాలు ఆవేదన కలిగిస్తాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ